రూ. 2.39 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు
155 మంది రైతులకు రూ. 1,60,98,598 చెల్లింపు
ధర్మారం, మే 19: ధర్మారం మండలం నర్సింహులపల్లిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. మండలం మొత్తం మీద ఈగ్రామంలో కొనుగోళ్లు ముగిసి ప్రథమస్థానంలో నిలిచింది. ఇక్కడ సుమారు రూ. 2.39 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి విక్రయించిన రైతులకు ఇప్పటికే రూ.1.60 కోట్లు చెల్లించామని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి వెల్లడించారు. వివరాలోకి వెళితే… నంది మేడారం సింగిల్ విండో పరిధి పెర్కపల్లి, లంబాడి తండా (బి), చామనపల్లి,ఎర్రగుంటపల్లి, బొమ్మారెడ్డిపల్లి, కొత్తపల్లి, నంది మేడారం, గోపాల్రావుపేట, సాయంపేట, బొట్లవనపర్తి, ఖిలావనపర్తి, బుచ్చయ్యపల్లి, నర్సింహులపల్లి, ఖానంపల్లి, పైడిచింతలపల్లి, రామయ్యపల్లి, దొంగతుర్తిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదట గత నెల18వ తేదీన లంబాడి తండా (బి)లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
మంత్రి ప్రారంభించిన మరుసటి రోజు 19వ తేదీన నర్సింహులపల్లిలో సర్పంచ్ అడువాల అరుణజ్యోతితో కలిసి ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి సం యుక్తంగా ప్రారంభించారు. కొనుగోళ్లను బలరాంరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గోనె సం చులు అందుబాటులో ఉంచి ధాన్యం రైస్ మిల్లులకు తరలించేలా కృషి చేశారు. ఏఈవో సతీశ్ కేంద్రంలో ధాన్యం తేమ శాతాన్ని నిర్ధారించారు. సెంటర్ ఇన్చార్జి, కంప్యూటర్ ఆపరేటర్ కొనుగోళ్ల వివరాలను నమోదు చేశారు. ఆన్లైన్లో విండో ఇన్చార్జి సీఈవో రాసూరి మల్లేశం ఆధ్వర్యంలో పూర్తి చేశారు. గ్రామ దడ్వాయిలు, హమాలీలు కొనుగోళ్లకు సహకారాన్ని అందించారు. ఈ కేంద్రంలో 195 మంది రైతుల నుం చి 12,674.80 కిలోల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వాటి విలువ రూ. 2,39,30,000 ఉంది. ఈ క్రమంలో కంప్యూటర్లో ఆన్లైన్ నమోదైన 155 మందికి రూ. 1,60,98,598 సొమ్మును రైతులకు జిల్లా సహకార శాఖ ద్వారా డబ్బులు చెల్లించారు. మిగతా రైతులకు త్వరలో చెల్లించనున్నారు. కొనుగోళ్లు ముగిశాయని బలరాంరెడ్డి వెల్లడించారు.