హైదరాబాద్ : డబ్బులు చెల్లించలేదని మృతదేహాన్ని మూడు రోజులుగా హాస్పిటల్లోనే ఉంచుకున్న అమానవీయ ఘటన నగరంలోని ఎల్బీ నగర్ నాగోలోని సుప్రజ దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..డేనియల్ ప్రాంక్లిన్ (41) కరోనా లక్షణాలతో ఈ నెల 18న సుప్రజ దవాఖానలో అడ్మిట్ అయ్యాడు.
చికిత్చ పొందుతూ 25న మృతి చెందాడు. కాగా, రూ.6 లక్షలు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని దవాఖాన యాజమాన్యం డెడ్బాడీని మూడు రోజులుగా హాస్పిటల్ సెల్లార్లోనే ఉంచారు. బాడీని అప్పగించాలంటూ బంధువులు దవాఖాన ముందు ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులు కలుగజేసుకోవడంతో మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
ఓరుగల్లులో గెలుపు టీఆర్ఎస్దే : మంత్రులు
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా