మేడ్చల్ మల్కాజిగిరి : ఈత కోసం వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అలియాబాద్ గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటేష్(43), నర్సింగ్రావు అన్నదమ్ములు. చెరువులో చేపలు పట్టుకుంటు జీవనం సాగిస్తున్నారు. కాగా, అన్నదమ్ములు ఆదివారం శామీర్పేట చెరువు వద్దకు ఈత కోసం చెరువులోకి దిగగా కొద్ది సేపటికి అన్న వెంకటేష్ నీటిలో మునిగిపోయినట్లు తమ్ముడు గమనించాడు.
కాపాడేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.
సంఘటన స్థలాన్ని సీఐ సుధీర్కుమార్ పరిశీలించారు. సంఘటన సంబంధించిన పూర్తి వివరాలను బాధిత కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు చేడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం