సుల్తాన్బజార్ : స్నేహితుడు సమస్యలలో ఉన్నాడని రెండు,మూడు రోజులలో వస్తానని వె ళ్ళిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పీఎస్ఐ ప్రతిభ తెలిపిన వివరాల ప్రకారం మహారాజ్గంజ్ ప్రాంతానికి చెందిన పలివల్ ముఖేష్ (31) వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇదిలా ఉండగా జనవరి 27న ముఖేష్ తన భార్యతో స్నేహితుడు సమస్యలలో ఉన్నాడని రెండు,మూడు రోజులలో వస్తానని తెలిపి వెళ్ళాడన్నారు. కాగా ఈ నెల 12న ముఖేష్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయ్యింది. నివాసానికి వస్తాడని చూస్తున్నా ఇంకా రాకపోవడంతో అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.