దౌల్తాబాద్ : మండలంలోని ఓ వ్యక్తి కుంటలో పడి మృతి చెందిన సంఘటన కౌడీడ్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ మోహినోద్ధిన్ కథనం ప్రకారం.. మండలంలోని కౌడీడ్ గ్రామానికి చెందిన బంటు కేశవులు (32) శనివారం ఉదయం పంట పొలానికి క్రిమిసంహారక మందును పిచికారీ చేసేందుకు భార్య మంజులతో కలిసి వెళ్లారు. పిచికారీ అనంతరం తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు సమీపంలో ఉన్న కుంట దగ్గరకు భర్త వెళ్లాడు. అయితే భర్త ప్రమాదావశత్తు కాలు జారీ కుంటలో పడి మృతి చెందాడు.
భర్త ఇంటికి రాకపోవడంతో భార్య సమీప కుంటలో వెతికితే శవమై కనిపించాడు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొడంగల్ ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు.