హైదరాబాద్ : ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన
హఫీజ్పేట్, హైటెక్ సిటీ మార్గంలో రైల్వే ట్రాక్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రైల్వే ట్రాక్ సమీపంలో విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకొని ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. క్లూస్ టీం, మియపూర్, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు జగద్గిరిగుట్ట నివాసి ఆంజనేయులు(45)గా గుర్తించారు. ఆంజనేయులు ఆటో డ్రైవర్గా పని చేసేవాడు. అతనికి ఐదుగురు సంతానం. నిన్న రాత్రి ఇంట్లో గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన ఆంజనేయులు రాత్రి పూట ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
Tokyo Olympics: స్విమ్మింగ్ రిలే ఈవెంట్లో చైనీస్ టీమ్ వరల్డ్ రికార్డ్
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు