రంగారెడ్డి : తేనెటీగల దాడిలో ఓ గీతకార్మికుడు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన జగతయ్య గౌడ్ (54) ఈ నెల 28న తాటిచెట్టు ఎక్కుతుండగా తేనెటీగలు అతడిపై దాడి చేశాయి. దీంతో జగతయ్యగౌడ్ తీవ్రంగా గాయడటంతో దవాఖానకు తరలించారు. కాగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కొడుకు.. తట్టుకోలేక తండ్రి మృతి
కర్ణాటక ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు