సిద్దిపేట : తల్లి మందలించిందని మనస్థాపం చెందిన కూతురు బలవన్మరణానికి పాల్పడింది.ఈ సంఘటన కొండపాక మండలం లకుడారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన ఈగ అఖిల (18) తల్లి మందలించిందని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
అఖిల ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది. ఇంటి పనుల్లో సహకరించడం లేదని ఏం పని చేయడం లేదని తల్లి మందలించింది. మనస్థాపానికి గురైన అఖిల ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పిడిందని తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Snake bite | తండ్రీ బిడ్డలను కాటేసిన పాము..చిన్నారి మృతి
రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి : మంత్రి ఐకే రెడ్డి
యాదాద్రికి పోటెత్తిన భక్తులు..