జయశంకర్ భూపాలపల్లి : మామ మృతిని తట్టుకోలేక కొన్ని గంటల వ్యవధిలోనే కోడలు మృతి చెందిన విషాద సంఘట ఘటన జిల్లాలోని పలిమెల మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. పలిమెల మండలకేంద్రానికి చెందిన లాట్కరి బస్వయ్య(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మామ మృతదేహం వద్ద రోదిస్తూ కోడలు లాట్కరి సోని(30) కుప్పకూలింది. బస్వయ్యను సోని తన సొంత తండ్రిలా భావించేదని, అందుకే అతడి మృతిని తట్టుకోలేక చనిపోయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఓ వైపు తండ్రి మరణించాడని బాధలో ఉన్న కుమారుడు, ఉప సర్పంచ్ వెంకటేశ్.. అంతలోనే భార్య కూడా చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో గ్రామస్తులను కంటతడి పెట్టింది. సోనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మరిది ప్రేమ పెండ్లి వదిన ప్రాణం తీసింది
దేశానికే ఆదర్శం ఇంటింటికి జ్వర సర్వే : ఎమ్మెల్సీ కవిత
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు