ఎల్బీనగర్ : మూసీ నదిలో ఓ గుర్తుతెలియని యువకుడి శవాన్ని చైతన్యపురి పోలీసులు కనుగొన్నారు. వరదనీటిలో కొట్టుకుని వచ్చిన సదరు వ్యక్తి శవం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫణిగిరి కాలనీ వద్ద ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని పక్కకు చేర్చారు.
సుమారు 25 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న ఈ యువకుడి శవం వరదనీటిలో కొట్టుకుని వచ్చిందని, మృతుడి కుడిచేతిపై దర్శన్ అనే పేరు హిందీలో పచ్చబొట్టు ఉందని చైతన్యపురి పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెల్సిన వారు చైతన్యపురి ఎస్ఐ నాగేశ్వర్రావు ఫోన్ నెంబర్ 9491030164, 9491053296లో సంప్రదించాలని వారు కోరారు. శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.