పాల్వంచ/భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వేములపల్లి సురేష్ అనే వ్యక్తి శనివారం బావి వద్ద స్తానం చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పాల్వంచ పోలీసులు ఆరు నిమిషాల్లోని అక్కడకు చేరుకున్నారు. కానిస్టేబుల్ ఎం.అంజయ్య వెంటనే బావిలోకి దిగి అతడిని కాపాడాడు. బావిలో పడిన వ్యక్తి బావికి ఉన్న మోటర్ పైపును పట్టుకుని ఉండటంతో ప్రమాదం తప్పింది. బావిలో దిగిన కానిస్టేబుల్ తాడు అందించి బయటకు తీసాడు. సకాలంలో స్పందించి బాధితుడిని కాపాడిన కానిస్టేబుల్ను స్థానికులు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
గన్తో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి