యాదాద్రి భువనగిరి : మంత్రాల నెపంతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిలువేరు మల్లయ్య ( 60)కు బంధువులతో చిన్న చిన్న తగాదాలు ఉన్న్నాయి. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా శివకుమార్ అనే యువకుడు అనారోగ్యం తో బాధపడుతూ నిన్న ఉదయం మరణించాడు.
దవాఖానల చుట్టూ తిరిగినప్పటికి నయం కాకపోవడంతో మల్లయ్యనే మంత్రాలు చేసి ఉంటాడని భావించి ఈ రోజు సాయంత్రం బావి వద్ద పశువులను మేపుతుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో మల్లయ్యను దారుణంగా నరికి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్తో హెల్త్ సూపర్ వైజర్ మృతి