శంకరపట్నం, ఏప్రిల్ 2: ప్రభుత్వ దవాఖానల్లో 15 రోజుల పాటు సెలవు దినాల్లో సైతం కరోనా వ్యాక్సినేషన్ను కొనసాగిస్తున్నట్లు హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో జువేరియా వెల్లడించారు. 45 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరూ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కనీసం నెల రోజుల పాటు ప్రజలు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకొని సెకండ్ వేవ్ బారిన పడకుండా ఉండాలని కోరారు. కాగా, శుక్రవారం 45 ఏండ్ల వయస్సు దాటిన 20 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పీహెచ్సీ వైద్యాధికారి షాకీర్ అహ్మద్ తెలిపారు. ఇక్కడ సీహెచ్వో భాస్కర్, ఫార్మసిస్ట్ మతిన్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
లక్ష్మీపూర్ పీహెచ్సీలో 47 మందికి టీకా
మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 2: మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ పీహెచ్సీలో 47 మందికి వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ స్వాతి తెలిపారు. కార్యక్రమంలో సూపర్ వైజర్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
‘కొవాగ్జిన్’కు బ్రెజిల్ నో..