మహబూబాబాబాద్ : జిల్లాలోని కురవి మండలం సీరోలు గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో బాలుడు చీకటి ఉజిత్(3) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గవిని వెంకన్న, హైమావతిలకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి మౌనికను మహబూబాబాద్లోని చీకటి వెంకటేష్కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు అబ్బాయిలు. సోమవారం ఉదయం మౌనిక తల్లిగారింటికి పిల్లలతో సహా వచ్చింది. వెంకన్న గ్రామంలో కోళ్ల వ్యాపారం చేస్తుంటాడు.
కొద్దిరోజులుగా ఇంట్లో సాంకేతిక లోపం మూలంగా అప్పుడప్పుడు కరెంటు షాక్ వస్తోంది. మౌనిక చిన్న కుమారుడు ఉజిత్(3) ఆరు బయట ఆడుకుంటూ కోళ్ల స్టాండ్ను పట్టుకున్నాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ రావడంతో ఉజిత్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబసభ్యులు ఖమ్మం దవాఖానకు తరలించారు. వైద్యం చేసేలోపే బాలుడు మృతిచెందాడు.
ఇవి కూడా చదవండి..
ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికిన తెల్ల బంగారం
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన