జగిత్యాల : జిల్లాలోని మల్యాల మండలం మ్యాడంపెల్లి గ్రామానికి చెందిన తడగొండ గంగయ్య 20 రోజుల క్రితం సౌదీలో మృతిచెందగా.. ఆయన మృతదేహం మంత్రి కేటీఆర్ కృషితో ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నది. ఈ మేరకు కుటుంబ సభ్యులు గంగయ్య మృతదేహన్ని స్వదేశానికి తెప్పించేలా చూడాలని మల్యాల జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, స్థానిక సర్పంచ్ గంగ మహేశ్వరికి విన్నవించడంతో వారు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో వెంటనే స్పందించి ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరపడంతో గంగయ్య మృతదేహం శనివారం అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకున్నది. అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించేందుకు రవాణ సౌకర్యం కల్పించారు. గ్రామానికి గంగయ్య మృతదేహం చేరుకోవడంతో పలువురి ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఉపాధి కోసం వెళ్తూ..మృత్యు ఒడిలోకి
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి