జహీరాబాద్/సంగారెడ్డి : నారింజ ప్రాజెక్టులో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైందని జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. రవి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని నారింజ ప్రాజెక్టు నీటిలో గర్తు తెలియని వ్యక్తి శవం ఉందని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. నీళ్లలో పురుషుడి మృతదేహం గుర్తించినట్లు తెలిపారు. మృతుడి షర్ట్ కాలర్ పైన కనకదుర్గ టైలర్ రహిమత్ నగర్ హైదరాబాద్ ఫోన్ 9440122791 ఉందన్నారు. మృతుడి సమాచారం తెలిసిన వారు జహీరాబాద్ రూరల్ ఎస్ఐ ఫోన్ నంబరు 9440901845కు ఫోన్ చేయాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ