న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటంతో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. దాంతో దాదాపు అన్ని ఆస్పత్రుల్లో బెడ్లతోపాటే ఆక్సిజన్కు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కారణంగా పలు ఆస్పత్రుల్లో కరోనా బాధితులు ఊపిరాడక పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ పొదుపు కోసం ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది.
ఆస్పత్రుల్లో వైద్య అవసరాలకు సరిపడా ఆక్సిజన్ను అందుబాటులో ఉంచటం కోసం హర్యానాలోని తమ కర్మాగారాలు అన్నింటినీ మూసివేస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి మారుతి సుజుకీ కంపెనీ ప్రతి రెండేండ్లకు ఒకసారి మెయింటెనెన్స్ షట్డౌన్ విధిస్తుంటుంది. ఆ మేరకు వచ్చే జూన్ నెలలో మెయింటెనెన్స్ షట్డౌన్ విధించాలని కంపెనీ నిర్ణయించింది.
కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరణ, ఆక్సిజన్ కొరత కారణంగా తమ మెయింటెనెన్స్ షట్డౌన్ను మే 1 నుంచి 9వ తేదీ వరకు అమలు చేయాలని నిర్ణయం చేసింది. తొమ్మిది రోజులపాటు తన కర్మాగారాల్లో మాన్యుఫాక్చరింగ్ను నిలిపివేయడంవల్ల ఆక్సిజన్ వినియోగం ఉండదని, దానివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరో కరోనా రోగులకు మేలు జరుగుతుందని ఆ సంస్థ భావిస్తున్నది.
గుజరాత్లోని సుజుకి మోటార్ కంపెనీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నదని మారుతీ సుజుకీ సంస్థ తెలిపింది. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం కర్మాగారాల్లోని ఆక్సిజన్ను ఆస్పత్రులకు మళ్లించడంలో ప్రభుత్వానికి మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకూ సిద్ధపడాల్సిందే: కేంద్రమంత్రి
ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!
గోవాలో రేపట్నుంచి నుంచి కంప్లీట్ లాక్డౌన్..!
కొవిడ్ టీకా వైరస్ సంక్రమణనే కాదు, వ్యాప్తినీ అడ్డుకుంటుందట..!
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్లో రెండు కేంద్రాలు..!
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో