యాలాల : తాండూరు మున్సిపల్ పరిధిలోని మల్లప్ప మడిగలో చోరి జరిగింది. తాండూరు పట్టణ సీఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. మల్లప్ప మడిగలో నివాసముంటున్న రాజేంద్రకుమార్ ఈ నెల నాలుగో తేదిన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదుకు వెళ్లాడు. తిరిగి 19వ తేది మధ్యహ్నం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో బీరువా తెరిచి ఉంది. అందులో 2కిలోల వెండితో పాటు 10 పట్టు చీరలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడు రాజేంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ గిరి తెలిపారు.