ములుగు : జిల్లాకేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రేమనగర్ గట్టమ్మ దేవాలయం వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. తీవ్ర గాయాలకు గురవడంతో అక్కడిక్కడే ద్విచక్ర వాహనంపైనే ప్రాణాలను వదిలాడు. మృతుడిని వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామానికి పల్లెవేణి రాజు (22)గా గుర్తించారు. మృతుడు జాకారం పత్తి మిల్లులో పని చేస్తున్నాడు. కూలీ పనులకు వెళ్లి.. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.