వర్గల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి సమీపంలోని ఓ వ్యవసాయ పొలం వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ ఫారెస్ట్ అధికారులు, గౌరారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. వర్గల్ దగ్గరలోని వ్యవసాయపొలం వద్ద అక్రమంగా నిల్వకుంచిన టేకు దుంగలను గ్రామస్తులు కొద్దిరోజులుగా గమనించి అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఇంత పెద్దఎత్తున దుంగలు ఇక్కడికి ఎవరు చేరవేశారు? ఎందుకు? దీని వెనక ఎవరు ఉన్నారు? అనే కోణంలో విచారణ మొదలు పెడుతున్నట్లు ఫారెస్టు అధికారి కిరణ్కుమార్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని త్వరలోనే నిజనిజాలు బయట పెడుతామని ఆయన వెల్లడించారు.