ఆగ్రా : యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) హాస్టల్ గదిలో 24 ఏండ్ల టీచర్ ఉరి వేసుకుని మరణించడం కలకలం రేపింది. బాధితుడు అలీగఢ్లోని ఏఎన్సీ కాలేజ్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. బాధిత టీచర్ను అభిషేక్ కుమార్ సక్సేనాగా గుర్తించారు. సక్సేనా గురువారం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఆయన వసతి గృహాన్ని ఖాళీ చేసి గతవారం రోజులుగా హాస్టల్ గదిలో ఉంటున్నాడు.
కాగా ఆగ్రాకు చెందిన ఓ మహిళ ఒత్తిడితోనే అభిషేక్ సక్సేనా తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అభిషేక్ ఆత్మహత్యకు పాల్పడే సమయంలో మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నారని, ఆమె తన సోదరుడిని బ్లాక్మెయిల్ చేసిందని బాధితుడి సోదరుడు ఆరోపించారు. యూపీలోని ఫిలిబిత్ అభిషేక్ స్వస్ధలమని పోలీసులు తెలిపారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.