తాండూరు : శరీరంపై పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం తాండూరు డీఎస్పీ కార్యాలయం ఆవరణలో చోటు చేసుకుంది. తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన రేణుక ఆస్తి విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ పడింది. సోదరుడితో పాటు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆమెను దూసించి, ఆస్తి రాకుండ చేస్తున్నారని తాండూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పోలీసుల ముందే ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ఆపాయం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసులో ఎలాంటి నిర్లక్ష్యం లేదని పూర్తిస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.