కొడకండ్ల/జనగామ : తన మరదలుతో పెండ్లి అవుతుందో లేదో అనే ఆవేదనతో మద్యం మత్తులో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రంలో చోటు చోసుకుంది. ఎస్ఐ ఎల్ పవన్ కుమార్ తెలిపిన వివరా ప్రకారం.. కొడకండ్ల మండలంలోని రామారం గ్రామానికి చెందిన కొమ్ము సతీష్ (22) కు తన మేనమామ కూతురితో పెండ్లి కుదిరింది. కాగా, కరోనాతో వివాహం వాయిదాపడింది. మళ్లీ ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉండగా అమ్మాయి తల్లికి అనారోగ్యం కారణంగా ఆపరేషన్ జరగడంతో పెండ్లి మళ్లీ వాయిదా పడింది.
దీంతో మనస్తాపం చెందిన సతీష్ తాగుడుకు అలవాటు పడ్డాడు. మద్యం మత్తులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే