బంజారాహిల్స్ : భార్యతో గొడవపడి సినీకార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మచిలీపట్నంకు చెందిన తారకేశ్వర్రావు (42) సినీపరిశ్రమలో కాస్టూమ్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. భార్య శ్రీపద్మ, కుమారుడితో కలిసి శ్రీకృష్ణానగర్లో ఓ గదిలో ఉంటున్నాడు. మద్యానికి బానిస అయిన తారకేశ్వర్రావు గతకొంత కాలంగా భార్యతో గొడవలుపడుతున్నాడు.
ఈనేఫథ్యంలో ఈనెల 10 న అర్ధరాత్రి దాటిన తర్వాత డబ్బు విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో తారకేశ్వర్రావు ఓ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అనంతరం లుంగితో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత గమనించిన భార్య స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. జూబ్లీహిల్స్పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.