బంజారాహిల్స్, మే 15: ఏడాది కాలంగా పెండ్లి సంబంధాలు చూస్తున్నా .. కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ సమీపంలోని కృష్ణానగర్ ఏ బ్లాక్లో నివాసముంటున్న కావ్య (23)కు ఏడాది కాలంగా కుటుంబ సభ్యులు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఎంతకీ సంబంధాలు కుదరడంలేదు. దీంతో కావ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.