జీడిమెట్ల: ఓ విద్యార్థి తల్లిదండ్రులకు లేఖ రాసి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ డివిజన్ చెరుకుపల్లి కాలనికి చెందిన శివుడు కుమారుడు పునీత్ (17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. సోమవారం ఉదయం నీట్ పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన పునీత్ రాత్రైనా ఇంటికి రాలేదు.
పునీత్ తండ్రి శివుడు సంబంధిత కళాశాలకు వెళ్ళి ఆరా తీయగా ఫలితం లేదు. అనంతరం పునీత్ ఉంటున్న గదిలో వెతకగా అతను రాసిన లేఖ దొరికింది. అయితే ఆ లేఖలో ఇంటి నుంచి తాను వెళ్ళిపోతున్నానని, ప్రశాంతంగా ఉండండి అంటూ పునీత్ రాసి లేఖను చదివి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.