కాచిగూడ : దవాఖానలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి వివరాల ప్రకారం ఓల్డ్ మలక్పేట ప్రాంతానికి చెందిన గౌసోద్ధిన్ కుమారుడు మహ్మాద్ ఖాసీమోద్ధిన్ (19) 10వ తరగతి చదువుతున్నాడు.
సోమవారం రాత్రి మలక్పేట- డబీర్పుర రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఎంఎంటీఎన్ (47194) రైలు ఢీకొనడంతో ఖాసీమోద్ధిన్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకొని ఖాసీమోద్ధిన్ను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.