Crime
- Dec 10, 2020 , 21:30:49
పబ్జిగేమ్కు బానిసై విద్యార్థి ఆత్మహత్య

కులకచర్ల : పబ్జిగేమ్కు అలవాటుపడిన యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్లలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన ఉప్పరి ఓంకార్(15) మొబైల్ఫోన్ కొనియాల్సిందిగా తల్లిదండ్రులను కోరాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించని కారణంగా నిరాకరించారు. ఇంటికి సహాయంగా ఉంటూ ఉన్న పండ్ల దుకాణాన్ని చూసుకోవాల్సిందిగా సూచిస్తూ తండ్రి.. కొడును మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఓంకార్ ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు ఎక్కువగా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడన్నారు. ఫోన్ కొనేందుకు రూ.15 వేలు అడిగితే ఇవ్వకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తండ్రి పేర్కొన్నాడు.
తాజావార్తలు
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్
- ఆదిపురుష్పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్
MOST READ
TRENDING