లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారికి మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. అధికార పార్టీ బీజేపీకి చెందిన సలోన్ ఎమ్మెల్యే దాల్ బహదూర్ శుక్రవారం ఉదయం మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే ఔరైయా ఎమ్మెల్యే రమేశ్ దివాకర్, లక్నో వెస్ట్ ఎమ్మెల్యే సురేష్ శ్రీవాత్సవా, నవాబ్గంజ్ ఎమ్మెల్యే కేసర్ సింగ్ గాంగ్వార్ కరోనా బారినపడి మృతిచెందారు.
దాల్ బహదూర్ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్బరేలీ జిల్లాలోని సలోన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిపై 16 వేల మెజార్టీతో గెలుపొందారు. కాగా, బహదూర్ మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి