మహబూబ్నగర్ : ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారిపై బహుళ వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాబోయే వారం పది రోజుల్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రితో హరిత హారం కింద జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరాలను వెల్లడించారు.
జిల్లాలో మొక్కలు నాటడం, నర్సరీల పెంపకతో పాటు 99 శాతం వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవటమే కాక మహిళా సంఘాలు 2 కోట్ల విత్తన బంతులు తయారు చేస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు కట్టే ముందు తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. మున్సిపాలిటీ కూడా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటేలా చూడాలన్నారు.
పట్టణంలో ఎన్నో పార్కులను ఏర్పాటు చేశామని, వాటిని అందంగా తీర్చి దిద్దాలన్నారు. అదేవిధంగా బై పాస్ చుట్టూ, మధ్యలో కూడా మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, కౌన్సిలర్ వనజ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి