న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కలిండి కుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని మురికి వాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఆరు ఫైర్ టెండర్లను తరలించింది. మంటలు, దట్టమైన పొగ కారణంగా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందికి ఎదురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మురికివాడలో అందరూ నిద్రిస్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి. రోహింగ్యా ముస్లిం శరణార్థుల శిబిరాలు మురికివాడలో ఉన్నాయి. అయితే, మంటలు చెలరేగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. శనివారం ఉదయం సైతం లాజ్పత్ నగర్ సెంట్రల్ మార్కెట్లోని షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరగ్గా భారీగా ఆస్తినష్టం జరిగింది.