హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం మోటుపల్లిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచిన మమకారాన్ని మరిచి కుమారుడు అతిదారుణంగా కొట్టి తండ్రిని హతమార్చాడు. మోటుపల్లికి చెందిన అమృతరావు (75) కుమారుడు సురేష్ (30) మధ్య మధ్యాహ్నం మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన సురేష్ రోకలి బండతో తండ్రి తలపై కొట్టాడు. దీంతో తల పగిలి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూడేళ్ల క్రితం సురేష్ భార్యను సైతం ఇదే తరహాలో హతమార్చిన గ్రామస్తులు తెలిపారు. ఘటనాస్థలంలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.