కరీంనగర్ : హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమే అని తెలిపారు. వెంటనే తేరుకుని మాట సవరించుకున్నారు. సమావేశంలో ఆయన ఇలా రెండు సార్లు తడబడ్డారు.