హైదరాబాద్ : నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెహదీపట్నం ఐసీఐసీఐ బ్యాంకు ఎటీఎం వద్ద దారుణం చోటుచేసుకుంది. నగదు డ్రా చేసుకోవడానికి వచ్చిన కాంగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసే రమేశ్ కుమార్ను కొందరు దుండగులు చితకబాదారు. అతని వద్ద ఉన్న డబ్బులు, పర్సు, రెండు బంగారు ఉంగరాలు, సెల్ఫోన్ను లాక్కొని పరారయ్యారు. కాగా తీవ్ర గాయాలపాలైన రమేశ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. పెళ్ళైన 8 నెలలకే భర్తను కోల్పోవడంతో స్థానిక అయోధ్య నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.