కోల్కతా: రూ.57 కోట్ల విలువైన పాము విషాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ దక్షిణ దీనాజ్పూర్లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడున్న 137వ బిఎస్ఎఫ్ బెటాలియన్కు చెందిన బీవోపీ చక్గోపాల్ దళాలు పాము విషాన్ని కలిగిన మూడు క్రిస్టల్ జాడీలను స్వాధీనం చేసుకున్నారు. డోంగి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఇవి బయటపడ్డాయి. మూడు గాజు జాడీల్లో పౌడర్, క్రిస్టల్, ద్రవ రూపంలో ఉన్న పాము విషం ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.57 కోట్లు ఉంటుందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి, అక్రమంగా ఎవరు రవాణా చేస్తున్నారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.