Crime
- Jan 09, 2021 , 20:01:28
హత్య కేసులో కుటుంబ సభ్యులు ఆరుగురు అరెస్టు

సంగారెడ్డి : హత్య కేసులో సంగారెడ్డి పోలీసులు ఆరుగురు కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. భూ వివాదంలో గడిచిన మంగళవారం చౌటకూర మండల కేంద్రంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ సభ్యులను ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులను కాశన్నగారి ప్రదీప్, సైదులు, ప్రసాద్, కరుణాకర్, సురేఖ, మణెమ్మగా గుర్తించారు. ఓ భూమి విషయంలో బేగరి కరుణాకర్ ఇతని తండ్రి దేవయ్యతో నిందిత కుటుంబానికి వివాదం ఉంది. ఈ నేపథ్యంలో కాశన్నగారి ప్రదీప్ ఇతని కుటుంబ సభ్యులు కరుణాకర్, దేవయ్యలపై గడిచిన మంగళవారం దాడిచేశారు. ఈ దాడిలో కరుణాకర్ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా దేవయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి డీఎస్పీ ఏ. బాలాజీ నిందితులను శనివారం నాడు జోగిపేటలో మీడియా ఎదుట హాజరుపరిచారు.
తాజావార్తలు
- బిగ్ రిలీఫ్ : భారీగా తగ్గిన బంగారం
- భారత్లో ‘మస్క్’ టెస్లా ఎంట్రీ చాలా హాట్ గురూ?!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- బుల్లెట్ల వర్షం కురిపించే బ్లాస్టింగ్ షూస్...!
- నితిన్ ‘చెక్’ విడుదల తేది ఖరారు
- రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుగా మారాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
- సంప్రదాయ బడ్జెట్ హల్వా వేడుక రేపే
- తాండవ్ మేకర్లకు షాక్
- అందుబాటులో ఇసుక : మంత్రి శ్రీనివాస్గౌడ్
- థాయ్లాండ్ ఓపెన్..పీవీ సింధుకు షాక్
MOST READ
TRENDING