పెద్దపెల్లి : జిల్లాలోని ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామంలో గురువారం ఉదయం విషాద సంఘటన చోటుచేసుకుంది. 33/11 కేవీ విద్యుత్ వైరు తెగి కింద పడడంతో షాక్కు గురై ఆరు బర్రెలు మృతిచెందాయి. పలువురి గ్రామస్తులకు ప్రాణాపాయం తృటిలో తప్పింది. సుమారు రూ. 2 లక్షల విలువైన నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటన సమాచారాన్ని స్థానిక విద్యుత్ అధికారులు, పోలీసులతో పాటు రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు సమాచారం ఇచ్చినట్లు గ్రామ సర్పంచ్ అడువాల అరుణజ్యోతి రవి తెలిపారు.