సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. హత్య కేసులో తనను జైలుకు పంపిందని కక్షగట్టిన మరిది.. వదినను దారుణం హతమార్చాడు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. రామాపురం గ్రామానికి చెందిన రేఖ సైదులు 2004లో తన సోదరుడు రేఖ పిచ్చయ్యను హత్య చేశాడు. ఈ కేసులో మూడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. హత్య కేసులో తనను సంబంధం లేకున్నా ఇరికించిందని వదిన రేఖ బయమ్మ (55) పై సైదులు కక్షపెంచుకున్నాడు.
శనివారం అర్ధరాత్రి బయమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా సుత్తితో తలపై కొట్టి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని ట్రాక్టర్లో పొలం వద్దకు తీసుకెళ్లి తగులబెట్టాడు. ఉదయం తన వదినను హత్య చేసినట్లు చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవరావు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.