ముంబై : యువతులను మోసగించి వారితో వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్న 35 ఏండ్ల ట్రాన్స్జెండర్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. విలేపార్లే సబర్బన్ నెహ్రూ నగర్ ప్రాంతంలో సెక్స్ రాకెట్ను రట్టు చేసిన పోలీసులు ఐదుగురు యువతులను కాపాడారు.
యువతులకు మాయమాటలు చెబుతూ వారిని నిర్వాహకులు బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారని పోలీసులు చెప్పారు. చిన్న గదిలో నిర్బంధించిన ఐదుగురు యువతులను కాపాడిన పోలీసులు వారిని షెల్టర్ హోంకు తరలించారు. ట్రాన్స్జెండర్తో పాటు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.