జైపూర్: సైదాబాద్లోని సింగరేణి కాలనీలో జరిగిన దారుణ ఘటన రాజస్థాన్లో రిపీట్ అయ్యింది. పొరుగున్న ఉండే 20 ఏండ్ల వ్యక్తి ఏండేండ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగౌర్ జిల్లా పాడు కలాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన ఏడేండ్ల బాలిక సోమవారం ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైంది. పాప కోసం తల్లిదండ్రులు అంతటా వెతికారు. కనిపించకపోవడంతో రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే మరునాడు తెల్లవారుజామున సమీప పొలాల్లో ఆ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పొరుగు ఇంట్లో ఉండే 20 ఏండ్ల యువకుడు ఆ బాలికను తీసుకెళ్లడాన్ని చూసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో మద్యం సేవించి ఉన్న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, అత్యాచారం, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్ డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇందిరా బవ్రి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు.