Crime
- Dec 31, 2020 , 09:55:51
కేరళలో ఏడు వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి

తిరువనంతపురం : కేరళలోని కుతిరన్ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిశూర్ సమీపంలో లారీ, కారు సహా వరుసగా ఏడు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఘటన జరగ్గా.. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది. తమిళనాడుకు చెందిన ఓ లారీ నియంత్రణ కోల్పోయి ఇతర వాహనాలను ఢీకొట్టింది. మొదట రెండు కార్లు బైక్తో ఢీకొట్టగా.. వెనుక ఉన్న వాహనాలు అదుపు తప్పిముందు ఉన్న ఇతర వాహనాలను ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. బ్రేకులు విరడంతో ట్రక్ నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం.
తాజావార్తలు
- ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు
- పోలీసుల కవాతు పరిశీలన
- ఆపదలో షీటీమ్లను ఆశ్రయించాలి
- రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: కలెక్టర్
- వాలీబాల్ C/O ఇనుగుర్తి
- సమస్యలు పరిష్కరిస్తా : జడ్పీ చైర్మన్
- అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
- సీసీ రోడ్డు పనులు ప్రారంభం
- ‘బాలికలు అద్భుతాలు సృష్టించాలి’
MOST READ
TRENDING