రంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండల పరిధిలోని తిప్పాయిగూడ గ్రామానికి చెందిన వ్యక్తి అక్రమంగా రేషన్ బియ్యాన్ని బొలోరా టీఎస్ 07యూజీ (5751) నెంబర్ గల వాహనంలో 7క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
అదేవిధంగా రంగాపూర్ సమీపంలో అక్రమంగా అటోలో తరలిస్తున్న 3 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులు పరారీలో ఉన్నారని, ఈమేరకు కేసున మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి : మంత్రి ఎర్రబెల్లి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..