వికారాబాద్ : అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
జిల్లాలోని దోమ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన అడివప్ప గ్రామంలో తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రంలోని ముదెళ్లిలో ఎక్కువ ధరకు విక్రయిస్తుంటాడు. కాగా, బియ్యం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. టాటా ఏసీ వాహనంలో బియ్యం తరలిస్తూ.. దాదాపూర్ గ్రామ శివారులో అడివప్ప పోలీసులకు పట్టుబడ్డాడు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దేవంబొట్ల రాజు తెలిపారు.
ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు!