కీసర : మండలంలోని కీసర, తిమ్మాయిపల్లి, చీర్యాల్, యాద్గార్పల్లి, అంకిరెడ్డిపల్లి, రాంపల్లిదాయర, భోగారం, నర్సంపల్లి, కరీంగూడ, గోధుమకుంట తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు నిర్వహించారు. కీసర, కరీంగూడ గ్రామాల్లో హరితహారంలో భాగంగా సర్పంచులు మాధురి వెంకటేశ్, గోపాల్రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, ఎంపీడీఓ పద్మావతి, ఎంపీఓ మంగతాయారు, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.
శామీర్పేట : విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు అలియాబాద్ పంచాయతీ పాలకవర్గం సభ్యులు తెలిపారు. గ్రామంలో వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, కిందకు వేలాడుతున్న వైర్లు, తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. లాల్గడి మలక్పేట, తుర్కపల్లి, మురహార్పల్లి, యాడారం, బొమ్మరాశిపేట గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతిలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఎంపీటీసీ సగ్గు శ్రీనివాస్యాదవ్, ఉపసర్పంచ్ ప్రభాకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సునీత పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్ : పల్లె ప్రగతితో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మర్పల్లిగూడలో సర్పంచ్ మంగమ్మ, ఉప సర్పంచ్ నరేష్తో కలిసి మొక్కలు నాటి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అవుషాపూర్, కొర్రెముల, ఘనపూర్, ప్రతాపసింగారం, చౌదరిగూడ, ఎదులాబాద్లో సర్పంచుల ఆధ్వర్యంలో శ్రమదానం చేసి మొక్కలు నాటడంతో పాటు పంపిణీ చేశారు. ఘనపూర్లో సర్పంచ్ గోపాల్ రెడ్డి డంపింగ్ యార్డు షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. సర్పంచులు కావేరి మచ్చేందర్ రెడ్డి, వెంకటేశ్ గౌడ్, శివశంకర్, బైరు రమాదేవి రాములు గౌడ్, సురేష్ పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : పల్లె ప్రగతిలో భాగంగా మండల పరిధిలోని డబిల్పూర్లో తడి, పొడి చెత్త సేకరణపై సర్పంచ్ గీతాభాగ్యారెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు గౌస్, ఎంపీటీసీ హేమలత, ఉప సర్పంచ్ సత్యనారాయణ, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.