వికారాబాద్, జూన్ 27 : అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని వికారాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అక్రమంగా రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
వికారాబాద్ పట్టణంలోని ఎంసీఆర్ చౌరస్తా వద్ద ఓ వాహనాన్ని తనిఖీ చేసి 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ మెగావత్ శ్రీను పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసినా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.