నారాయణపేట : జిల్లాలోని ఊట్కూర్ మండల కేంద్రంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రవి కథనం మేరకు.. గ్రామానికి చెందిన శంకర్ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా కిరాణా వస్తువుల మాటున నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రూ. 50 వేల విలువ చేసే గుట్కా రాకెట్లను యజమాని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆలయాల్లో ఆన్లైన్ ఆర్జిత సేవలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి