నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 20: కోటగిరి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గురువారం 35 మందికి కరోనా టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు డాక్టర్ సమత తెలిపారు. పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 21మందికి పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో గురువారం 33 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు. వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో 32 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. డిచ్పల్లి, ఘన్పూర్ ఉన్నత పాఠశాలలో 30 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10 మందికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ బాబురావు తెలిపారు. మోస్రా మండల కేంద్రంలో 87 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు.
జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 33 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. జక్రాన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని గ్రామ సర్పంచులు పిచికారీ చేయించారు. మోస్రా మండలకేంద్రంతోపాటు చింతకుంట గ్రామంలోని వృద్ధాశ్రమం, కొవిడ్ నుంచి కోలుకున్న వారి ఇండ్ల వద్ద విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మండల సహ కార్యదర్శి ప్రీతం, ప్రతినిధులు గంగాప్రసాద్, శ్రీరామ్గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ సీహెచ్సీలో గురువారం 21 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్ రవికుమార్ తెలిపారు.
భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్ వచ్చినట్ల్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖాన, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలువురికి కరోనా టెస్టులు నిర్వహించగా 11 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్ తెలిపారు. బోధన్ మండలంలోని సాలూరా పీహెచ్సీ పరిధిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని సాలూరా పీహెచ్సీ మెడికల్ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. 56 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో గురువారం కరోనా పరీక్షలు నిర్వహించారు. బోధన్ లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 47 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి, రాకాసీపేట్ అర్బన్హెల్త్ సెంటర్లో 17 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, పాన్గల్లీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 26 మం దికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు వెల్లడించారు. మాక్లూర్ మండలంలో ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు సిఖిందర్నాయక్, ఆనంద్ తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమికి ఆరోగ్య కేంద్రంలో 42 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి అజయ్కుమార్ తెలిపారు. ఇందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కందకుర్తి చెక్పోస్టు వద్ద 29 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారిణి క్రిస్టినా తెలిపారు.