కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని కెరమెరి మండలం సావర్ ఖేడ్ గ్రామంలో 50 కేజీల గంజాయిని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం సావర్ ఖేడ్ గ్రామం వేళ్లే దారిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారును ఆపి సోదా చేయగా రెండు కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను విచారించగా సావర్ ఖేడ్ గ్రామం ఇద్దరు వ్యక్తుల వద్ద ఉందని తెలిపారు. గ్రామంలోని తుకారాం అనే అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా 48 కిలోల గంజాయి దొరికింది. నిందితులు బిక్కు, తుకారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రమేష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత