జోగులాంబ గద్వాల : జిల్లాలోని మల్దకల్ మండలంలో టాస్క్ఫోర్స్ పోలీసులు మూడు గ్రామాల్లో దాడి చేసి సుమారు 17 క్వింటాలు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్తీ విత్తనాలు నిల్వ చేశారనే విశ్వసనీయ సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించామన్నారు.
అడివి రావుల చెరువు గ్రామంలో బోయ తిమ్మయ్య, నారాయణ, సవారన్న తమ పొలం దగ్గర గుడిసె లో 12.5 క్వింటాల నకిలీ విత్తనాలను దాచుకొని పెట్టుకోగా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనార్దన్, ఎస్సై నరేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని వ్యవసాయ శాఖ అధికారుల ఫర్యాదు మేరకు వాపై కేసు నమోదు చేశామని ఎస్ఐ నరేష్ కుమార్ పేర్కొన్నారు.
అలాగే బోయ తిరుమల్, ఉప్పరి పెద్ద వీరన్న ఇండ్లలో తనిఖీలు చేపట్టి 3 క్వింటాల నకిలీ విత్తనాలు, తాటి కుంట గ్రామంలోని నాయకి మధు ఇంట్లో సోదాలు నిర్వహించి 170 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని మండల ఏవో రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు.
జిల్లా లో ఎవరైనా ఆర్గనైజర్లమంటూ నకిలీ సీడ్స్ ను అమ్ముతున్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టి కి వచ్చిన ప్రజలు స్వచ్చందంగా సంబంధిత పోలీస్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకరావాలన్నారు.
లేదా డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ నెం -9494921100 కు సమాచారం అందించిన వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పువ్వాడ