బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. అయితే సల్మాన్ నటించిన తాజా చిత్రం రాధేని జీ5 యాప్తో పాటు థియేటర్ లో ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ భావించారు.కాని కరోనా ఉధృతంగా ఉండడం వలన రాధే చిత్రాన్ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జీ 5లో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేశారు.
సల్మాన్ లాంటి స్టార్ హీరో సినిమా థియేటర్లో విడుదలైతే ఆ రచ్చ వేరేలా ఉంటుంది. అలాంటి ఓటీటీలో వస్తుంది అంటే ఇంకా ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాధే చిత్రం నేరుగా స్ట్రీమింగ్ కు రావడంతో భాయ్ దెబ్బకు జీ 5 వారి స్ట్రీమింగ్ యాప్ క్రాష్ అయ్యిపోయిందట. మొత్తం 1 మిలియన్ మందికి పైగానే సినిమా చూసేందుకు రావడంతో ఇలా జరిగిందని అంటున్నారు. పే పర్ వ్యూ తీసుకొచ్చిన కూడా అభిమానుల ఆదరణ బాగానే దక్కిందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన సీటీమార్ సాంగ్కు సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాక సినిమాపై అంచనాలు పెంచింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ కథానాయికగా నటిస్తుంది.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ
జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి వేముల
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు : మంత్రి అల్లోల